గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష సమయంలో మార్పులు

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.

By :  Vamshi
Update: 2024-08-16 14:51 GMT

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రకటించింది. ఇంతకు ముందు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30వరకు అని వెబ్ నోట్ ఇచ్చామని, దాన్ని తాజాగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటలకు మార్చినట్లు టీజీపీఎస్సీ పేర్కొన్నది 

అక్టోబరు 21 నుంచి అక్టోబర్ 27 వరకు హైదరాబాద్ నగరంలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్థూ మీడియంలో పరీక్షలు జరగనున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలోని 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. జులై మొదటి వారంలో 1:50 నిష్పత్తి ప్రకారం 32 వేల మంది అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేసింది.

Tags:    

Similar News