రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు

స్మృతి వనం వద్ద రామోజీరావుకు కడసారి వీడ్కోలు

Byline :  Vamshi
Update: 2024-06-09 05:49 GMT

మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల ఛైర్శన్ రామోజీరావు అంతిమయాత్రలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గోన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భౌతికకాయానికి అంజలి ఘటించిన ఆయన స్మృతివనం వరుకు సాగిన యాత్రలో రామోజీ పాడెను చంద్రబాబు మోశారు. బంధువులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, రామోజీ సంస్థల ఉద్యోగులు ఆయన పార్థివదేహం వెంట నడిచారు. రామోజీరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే పోలీస్ బ్యాండ్ తో పాటు సిబ్బంది ముందు నడవగా.. పూలరథంలో రామోజీ పార్థివదేహాన్ని ఉంచి స్మృతివనానికి తీసుకొని వెళ్లారు. రామోజీ మృతికి నివాళిగా ఆంధ్రప్రదేశ్‌లో రెండ్రోజులపాటు (ఆది, సోమవారాలు) సంతాప దినాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం సినిమా షూటింగ్‌లను నిలిపివేస్తూ చలనచిత్ర నిర్మాతల మండలి సైతం బంద్‌కు పిలుపునిచ్చింది.రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు నిర్వహించారు

Tags:    

Similar News