అచ్యుతాపురం క్షతగాత్రులను పరామర్శించిన చంద్రబాబు

అచ్యుతాపురం ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆరోగ్య పరిస్థితి అడిగి సీఎం తెలుసుకున్నారు.

By :  Vamshi
Update: 2024-08-22 07:59 GMT

అచ్యుతాపురం ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆరోగ్య పరిస్థితి అడిగి సీఎం తెలుసుకున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఇక అటు అనకాపల్లి జిల్లా ఎన్డీఆర్ ఆసుపత్రి గేటు బయట సెజ్ మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారాన్ని, ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాతో పాటుగా ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News