అమిత్ షాతో చంపయి సోరెన్ భేటీ.. ఈ నెల 30న బీజేపీలోకి

ఝర్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ బీజేపీలో ఆగస్టు 30న రాంచీలో చేరనున్నారు. ఈ విషయాన్ని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

By :  Vamshi
Update: 2024-08-27 02:19 GMT

ఝర్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ బీజేపీలో ఆగస్టు 30న రాంచీలో చేరనున్నారు. ఈ విషయాన్ని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని బిశ్వ శర్మ పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జేఎంఎం సీనియర్ నాయకుడు సోరెన్ సొంతంగా పార్టీ స్థాపిస్తారా? లేక కమలం పార్టీలోకి చేరతారా? అంటూ కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖరారైంది.

సీఎం హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లడంతో రాష్ట్రానికి 12వ ముఖ్యమంత్రిగా చంపయి సోరెన్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలై జులై 4న తిరిగి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇందుకు ఒక రోజు ముందుగానే అంటే జులై 3న ముఖ్యమంత్రి పదవికి చంపయి సోరెన్ రాజీనామా చేశారు. అయితే పార్టీ నాయకత్వం చంపయి సోరెన్‌ను అవమానించిందంటూ ఆయన వర్గం ఆరోపిస్తోంది. అసంతృప్తిగా ఉన్న ఆయన బీజేపీలో చేరబోతున్నారని, ఇందుకోసం చర్చలు కూడా జరిపారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News