టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై కేసు నమోదు

యువ హీరో రాజ్ తరుణ్‌పై కేసు నమోదైంది.

By :  Vamshi
Update: 2024-07-10 08:12 GMT

టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్‌పై హైదరాబాద్ నార్సింగ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అబార్షన్‌కు సంబంధించి మెడికల్ రిపోర్టులతో పాటు 170 ఫోటోలను పోలీసులకు సమర్పించింది. దీంతో నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్‌తరుణ్‌తో పదేళ్ల క్రితమే తనకు పెళ్లి అయిందని లావణ్య ఆరోపించారు.

అన్విక పేరుతో తాను రాజ్‌తరుణ్ విదేశాలకు కూడా వెళ్లామని తెలిపారు. 11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను… గుడిలో వివాహం కూడా చేసుకున్నాం. కానీ తన సినిమాలో నటిస్తున్న హీరోయిన్ తో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడని ఆగ్రహించింది. 3 నెలల క్రితం రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడు….రాజ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడింది. రాజ్‌ తరుణ్‌ నా ప్రపంచం..రాజ్‌ నాకు కావాలి….నాకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసింది లావణ్య.

Tags:    

Similar News