సీఎం రేవంత్పై ట్వీట్ చేసినందుకు క్రిశాంక్ పై కేసు
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ మన్నె క్రిశాంక్పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
By : Vamshi
Update: 2024-07-31 16:29 GMT
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ గైర్హాజరుపై సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్పై కాంగ్రెస్ ప్రభుత్వం నమోదు కేసు చేసింది. 29 జూలై నాడు మధ్య రాత్రి వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గైర్హాజరు అని క్రిశాంక్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు దీనిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. క్రిశాంక్పై ఇది 7వ కేసు. బీఆర్ఎస్ సీనియర్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై సీఎం చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.