లేటరల్‌ ఎంట్రీ రద్దు.. వెనక్కి తగ్గిన ఎన్డీయే సర్కార్

లేటరల్ ఎంట్రీ విధానంపై ఎన్డీయే సర్కార్ వెనక్కి తగ్గింది. వివిధ రంగాల నిపుణులకు ప్రభుత్వంలోని ఆయా విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించే పద్దతినే లేటరల్ ఎంట్రీ విధానం అంటారు. అయితే తాజాగా దీనిపై మోదీ సర్కార్ వెనకడుగు వేసింది.

By :  Vamshi
Update: 2024-08-20 12:54 GMT

లేటరల్ ఎంట్రీ విధానంపై ఎన్డీయే సర్కార్ వెనక్కి తగ్గింది. వివిధ రంగాల నిపుణులకు ప్రభుత్వంలోని ఆయా విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించే పద్దతినే లేటరల్ ఎంట్రీ విధానం అంటారు. అయితే తాజాగా దీనిపై మోదీ సర్కార్ వెనకడుగు వేసింది. తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ యూపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు యూపీఎస్సీ ఛైర్మన్‌కు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాశారు. దేశంలోని ఉన్నత స్థాయి ఉద్యోగాలు యూపీఎస్సీ తో సంబంధం లేకుండా.. లెటరల్ ఎంట్రీ లకు నీతి ఆయోగ్ సూచనల మేరకు కేంద్రం జారీ చేసింది. ఈ విధానం దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. అలాగే బీజేపీ నేతలు కూడా రిజర్వేషన్లను కొనసాగించాలని.. ఈ లెటరల్ ఎంట్రీతో రిజర్వేషన్లను అనిచివేయడమే అని ఆరోపణలు చేశారు. అలాగే పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఈ లెటరల్ ఎంట్రీ విధానాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం యూసీఎస్సీని ఆర్ఎస్ఎస్ తో నింపాలని చూస్తొందని విమర్శించారు.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇందులో 45 మంది స్పెషలిస్ట్‌ల పార్శ్వ ప్రవేశాన్ని కోరుతూ విడుదల చేసిన ప్రకటనను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ "పార్శ్వ ప్రవేశ ప్రక్రియ సమానత్వం, సామాజిక న్యాయం, ముఖ్యంగా రిజర్వేషన్ల నిబంధనలకు సంబంధించిన సూత్రాలకు అనుగుణంగా ఉండాలని దృఢంగా విశ్వసిస్తున్నారని" లేఖలో సింగ్ పేర్కొన్నారు. యూపీఎస్సీ నోటిఫికేషన్ రద్దు నిర్ణయంతో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ప్రధాని మోదీ కట్టుబడ్డారని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఈ విధానాన్ని తీసుకొచ్చింది గత యూపీఏ ప్రభుత్వమే. 2005లో వీరప్ప మొయిలీ అధ్యక్షతన నియమించిన రెండో ఎస్సార్సీ సైతం ఈ విధానాన్ని బలంగా సమర్థించింది. దాన్ని అమలుచేసేందుకు ఎన్‌డీయే ప్రభుత్వం పారదర్శక విధానాన్ని తీసుకొచ్చింది’’ అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.

Tags:    

Similar News