ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. జులై 23న బడ్జెట్

జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహణకు అనుమతి ఇచ్చారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.

By :  Vamshi
Update: 2024-07-06 11:41 GMT

కేంద్రంలో ఎన్డీయే సర్కార్ వచ్చాక తొలిసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. జులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు నిర్వహణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతి ఇచ్చారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. నిర్మలా సీతారామన్ తాజాగా ఆర్బీఐ గవర్నర్ తో సమావేశమయ్యారు. బడ్జెట్ కేటాయింపుల అంశంపై చర్చించారు.

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఏడోసారి. ఈసారి ఏపీలో ఎన్డీయే కూటమి పార్టీలు అధికారంలో ఉండడంతో, రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తి కలిగిస్తోంది. వరుసగా ఏడోసారి బడ్జెట్‌ని ప్రవేశపెట్టి అరుదైన రికార్డుని సొంతం చేసుకోనున్నారు నిర్మలా సీతారామన్. అంతకు ముందు మొరార్జీ దేశాయ్ పేరిట ఈ రికార్డు ఉండగా దీన్ని అధిగమించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్‌లో తొలిసారి ప్రకటిస్తున్న పద్దు ఇది. ఫలితంగా ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది.

Tags:    

Similar News