ఒలింపిక్స్లో భారత హాకి జట్టుకు కాంస్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకి జట్టు దేశానికి నాలుగో కాంస్య పతకం అందించారు.
By : Vamshi
Update: 2024-08-08 14:06 GMT
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకి జట్టు కాంస్యం పతకం సాధించింది. సెమీ ఫైనల్స్లో స్పెయిన్పై 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో ఇండియా ఖాతాలో మొత్తం 4 బ్రాంజ్ మెడల్స్ చేరాయి. కాగా టోక్యో ఒలింపిక్స్లోనూ భారత్ హాకి జట్టు కాంస్యం సాధించింది. ఒకదశలో 1-0తో వెనకబడిన భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ వరుస గోల్స్తో ప్రత్యర్థికి దడపుట్టించింది. చిరస్మరణీయ విజయంతో కాంస్యాన్ని ముద్దాడింది. ఆఖరి ఒలింపిక్స్ ఆడుతున్న గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్కు ఘనమైన వీడ్కోలు పలికింది.