తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రేపు భూమి పూజ: పొన్నం

డాక్టర్‌ బీ ఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణం లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ రేపు ఉదయం 11:00 గంటలకు జరగనున్నదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

By :  Raju
Update: 2024-08-27 14:19 GMT

డాక్టర్‌ బీ ఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణం లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటునకు భూమి పూజ రేపు ఉదయం 11:00 గంటలకు జరగనున్నదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు ,ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి సెక్రటేరియట్ లో చూసిన ప్రదేశంలోనే ఈ విగ్రహావిష్కరణ జరగనున్నదని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 9 తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభం ఉండనున్నదని మంత్రి వెల్లడించారు. 

Tags:    

Similar News