ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ ఏర్పాట్లను పరిశీలించిన భట్టి
ఈ నెల 6న హైదరాబాద్లో జరగనున్నది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మధ్య విభజన సమస్యలకు సంబంధించిన కీలక భేటీ జరగనున్నది.దీనికి ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సమావేశం ఈ నెల 6న హైదరాబాద్లో జరగనున్నది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మధ్య విభజన సమస్యలకు సంబంధించిన కీలక భేటీ జరగనున్నది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.
ఈ మేరకు ప్రగతిభవన్లో జరగనున్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి పరిశీలించారు. విభజన సమస్యలను పరిష్కరించుకుందామని చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ లేఖ రాశారు. దీనిపై రేవంత్ కూడా సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే.
సమావేశంలో చర్చించాల్సిన అంశాల అజెండాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. ఈ నెల 6న జరగనున్న భేటీకి ఏర్పాటు చేయాలని ఇప్పటికే సీఎం అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై సహచర మంత్రులు, ఉన్నతాధికారులతోనే సీఎం చర్చలు జరిపారు.