వైద్యారోగ్యశాఖలో ఉత్తమ విధానాలు అమలుచేయాలి: చంద్రబాబు

ఏపీలోని ప్రభుత్వాస్పత్రులను దేశంలోనే బెస్ట్‌ హాస్పిటల్స్‌గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

By :  Raju
Update: 2024-08-12 13:28 GMT

ఏపీలోని ప్రభుత్వాస్పత్రులను దేశంలోనే బెస్ట్‌ హాస్పిటల్స్‌గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్యశాఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. వైద్యారోగ్యశాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని, టెలీ మెడిసిన్‌ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

కిడ్నీ బాధితుల వివరాలను మండలాల వారీగా సేకరించాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని, రోగులకు శుభ్రమైన బెడ్‌షీట్లను అందించాలని సీఎం సూచించారు. 

Tags:    

Similar News