భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఉత్కంఠ పోరులో విజయం సాధించి వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచిన రోహిత్‌ సేనకు బీసీసీఐ.125 కోట్ల భారీ నగదు బహుమతి ప్రకటించింది.

By :  Raju
Update: 2024-06-30 17:38 GMT

టీ20 ప్రపంచకప్‌ గెలిచి కోట్లాదిమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న భారతజట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ. 125 కోట్ల భారీ నగదు బహుమతి ఇస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా 'ఎక్స్‌' వేదికగా ప్రకటించారు.

శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఉత్కంఠ పోరులో విజయం సాధించి రెండోసారి టీ20 కప్‌ను భారత ఖాతాలో చేర్చిన రోహిత్‌ సేనకు బీసీసీఐ భారీ మొత్తాన్ని ప్రకటించింది.

ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ను గెలిచినందుకు టీమిండియాకు రూ. 125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నా. టోర్నమెంట్‌ ఆసాంతం జట్టు అసాధారణమైన ప్రతిభ, సంకల్పం, క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. అద్భుత విజయం సాధించిన ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయ సిబ్బందికి అభినందనలు' అని జై షా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 

Tags:    

Similar News