వాళ్ల కుమ్మక్కుతోనే బెయిల్: మహేశ్కుమార్ గౌడ్
బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ విమర్శ
By : Raju
Update: 2024-08-27 10:17 GMT
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఊహించిందేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చిందని ఆయన ఆరోపించారు. మొన్నటి ఎన్నికల్లో చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ను దెబ్బతీయాలని చూశారని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో కుమ్మక్కై బీఆర్ఎస్ బీజేపీకి దాసోహమైందని విమర్శించారు.
హరీశ్రావు, కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ తిరిగి ఆపద మొక్కులు మొక్కారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్లమీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందని మహేశ్కుమార్ పేర్కొన్నారు.