రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
By : Vamshi
Update: 2024-07-08 06:59 GMT
దిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా హస్తినలోని రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ ఆమె లాయర్లు పిటిషన్ వేశారు. కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవలే మద్యం కుంభకోణంలో సీబీఐ నమోదు చేసిన కేసులో ఎమ్మెల్సీ కవితకు విధించిన జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కవిత కస్టడీ కాలపరిమితి శుక్రవారంతో ముగియడంతో తిహాడ్ జైలు నుంచి ఆమెను వీడియో కాన్ఫరేెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు.