కవితకు బెయిల్ నైతిక విజయం: మాజీ మంత్రి సింగిరెడ్డి

బెయిల్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని, ఇవి కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయి.

By :  Raju
Update: 2024-08-27 09:27 GMT

మద్యం పాలసీలో ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ కక్ష్యతో దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసులో కవితకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆధారాల్లేని కేసులో ఐదు నెలలు జైలులో ఉంచడం బాధాకరమన్నారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని రెండు రాజకీయ పార్టీల ఒప్పందంగా పేర్కొనడం కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని మాజీ మంత్రి మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయని అన్నారు. కవిత కేసులో న్యాయవాది వృత్తిపరంగా వ్యవహరించారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలు బయటపడ్డాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దానితో సంబంధం ఉందని తెలుస్తున్నది. కోట్ల రూపాయలు అక్రమంగా అనుమానాస్పద ఖాతాల్లోకి మళ్లాయన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు ఈడీ చర్యలు తీసుకోలేదు. దీంతోనే ఏ పార్టీ ఏ పార్టీతో కలిసి పనిచేస్తుందో అర్ధమవుతున్నదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

Tags:    

Similar News