మహిళ జర్నలిస్టులపై దాడి.. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వండి

నాగర్ కర్నూల్ ఎస్పీని ఆదేశించిన మహిళ కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద

Update: 2024-08-23 07:22 GMT

సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో మహిళ జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై జరిగిన దాడిపై మహిళ కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద స్పందించారు. తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు జర్నలిస్టులు కమిషన్ ను అపాయింట్ మేరకు కోరారు. ఈ సందర్భంగా దాడి ఘటనపై వివరాలు తెలుసుకున్న నేరెళ్ల శారద నాగర్ కర్నూల్ ఎస్పీకి లేఖ రాశారని మహిళ కమిషన్ శుక్రవారం ట్వీట్ చేసింది. కొండారెడ్డిపల్లిలో జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపి వీలైనంత తర్వాగా తమకు నివేదిక ఇవ్వాలని చైర్ పర్సన్ ఆదేశించారు. కాసేపట్లోనే మహిళ జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి మహిళ కమిషన్ చైర్ పర్సన్ ను కలిసి తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేయనున్నారు.

Tags:    

Similar News