హైదరాబాద్‌లో దారుణం.. రన్నింగ్ బస్సులో మహిళపై అత్యాచారం

కదులుతున్న బస్సులో మహిళపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు

By :  Vamshi
Update: 2024-07-30 10:33 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రైం రేటు విపరీతంగా పెరుగుతుంది. రేవంత్ సర్కార్ 8 నెలల పాలనలో హ‌త్య‌లు 500, డ‌కాయిటీస్ 60, దోపిడీలు 400, దొంగ‌త‌నం కేసులు 10 వేలు, రేప్ కేసులు 1800 న‌మోదైన‌ట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. పోయిన ఒక్క నెలలోనే హైదరాబాద్ నగరంలో 28 మర్డర్లు జరిగాయని తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో దారుణం జరిగింది. రన్నింగ్ బస్సులో మహిళపై లైంగిక దాడి ఘటన సంచలన రేపింది. తెలంగాణలోని నిర్మల్‌ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న బస్సులో మహిళపై అఘాయిత్యం జరిగింది.

నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్‌ తనపై అత్యాచారం చేశాడని డయల్‌ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఓయూ పీఎస్‌ సమీపంలో బస్సును ఆపి సీజ్‌ చేశారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉండగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో డ్రైవర్‌ (ప్రధాన నిందితుడి) కోసం గాలిస్తున్నట్లు సీఐ రాజేందర్‌ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ బస్సులో వేరే ప్రయాణికులు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన డ్రైవర్లు కృ ష్ణ, సిద్దయ్య బస్సు అద్దాలనుమూసేసినట్లు బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత సిద్దయ్య బస్సు నడుపుతుండగా కృష్ణ తన నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడని ఆమె వాపోయింది. హైదరాబాద్‌ మెట్టుగూడ వద్ద డ్రైవర్ కృష్ణ, బస్సు వదిలి పారిపోయాడు.

Tags:    

Similar News