రాజ్‌భవన్‌లో ఎట్‌ హోం.. బీఆర్‌ఎస్‌ దూరం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్ ‌హోం కార్యక్రమం నిర్వహించారు.

By :  Vamshi
Update: 2024-08-15 16:04 GMT

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్ ‌హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను, పద్మ అవార్డు గ్రహీతలను గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పలికరించారు. మరోవైపు.. ఎట్‌ హోం కార్యక్రమానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌, బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్ రామిరెడ్డి హాజరయ్యారు. ఇక, ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొనలేదు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌ సహా మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌, సీఎస్‌ శాంతకుమారి, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News