కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవేనా?: సంజయ్
పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి అంటూ నాడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎక్కడ పోయాయి అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రశ్నించారు.
By : Raju
Update: 2024-07-05 07:30 GMT
ఆరు మంది ఎమ్మెల్యేలు, ఆరు మంది ఎమ్మెల్సీ లు పార్టీ లో చేర్చుకోవడమే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలా అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎక్కడ పోయాయి అని నిలదీశారు. ఈ రాజకీయాలు చూస్తూ యువత అసహించుకుంటున్నారు.
నిన్న రాత్రి పార్టీ మారిన ఎమ్మెల్సీలు చాలాకాలం నుంచి పదవులు అనుభవించిన వారేనన్న సంజయ్ వారికి కేసీఆర్ ఏం తక్కువ చేయలేదన్నారు. ఆ నేతలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు.