జూరాలకు జలకళ

మహారాష్ట్ర-కర్ణాటక రాష్ట్రాల్లో పడుతున్న భారీ వర్షాలకు జోగులాంబ గద్వాల జూరాల జలాశయం జలకళను సంతరించుకున్నది.

By :  Raju
Update: 2024-07-18 04:06 GMT

మహారాష్ట్ర-కర్ణాటక రాష్ట్రాల్లో పడుతున్న భారీ వర్షాలకు జోగులాంబ గద్వాల జూరాల జలాశయం జలకళను సంతరించుకున్నది. 81,033 క్యూసెక్కుల నీరు ఆల్మట్టి ప్రాజెక్టులోకి చేరుతున్నది. ప్రాజెక్టు నుంచి దిగువకు 65 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 519.6 మీటర్లు కాగా ప్రస్తుతం 518.11 మీటర్లు ఉన్నది.

నారాయణపూర్‌ ప్రాజెక్టులోకి 55 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా ప్రాజెక్టు నుంచి దిగువనకు 37,260 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 492.25మీటర్లు కాగా ప్రస్తుతం 491.68 మీటర్లు ఉన్నది. జూరాల ప్రాజెక్టుకు 2, ప్రాజెక్టు నుంచి దిగువనకు 2, 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7. 663 టీఎంసీలుగా ఉన్నది. జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో అధికారులు జల విద్యుత్‌ ద్వారా ఒక యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఉన్న కుడి, ఎడమ కాలువలతో పాటు నెట్టంపాడు, భీమా ఎత్తిపోతల ద్వారా సాగు నీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు.

Tags:    

Similar News