ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రధానిని కోరారు.

By :  Vamshi
Update: 2024-08-17 12:05 GMT

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రధానిని కోరారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి నిధులు మంజురు చేయాలని విజ్ఞప్తి చేశారు. వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు, వెనుకబడిన జిల్లాలకు ఫండ్స్ కోరినట్లు తెలుస్తోంది. కొత్త రుణాలపై ప్రధాని మోదీతో బాబు చర్చించే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్‌లో అమరావతి ప్రత్యేక సహాయం కింద 15 వేల కోట్లు ప్రకటన చర్చించినట్లు టాక్. ఇవాళ రాత్రి 7 గంటలకు చంద్రబాబు కేంద్ర హెూం శాఖ మంత్రి అమిత్‌షా, తర్వాత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ కానున్నారు.

Tags:    

Similar News