హీరో రాజ్ తరుణ్కు ముందస్తు బెయిల్
టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
By : Vamshi
Update: 2024-08-08 14:33 GMT
టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయనకు ముందుస్తు బెయిల్ లభించింది. రూ.20 వేల పూచీకత్తుతో రాజ్ తరుణ్కు న్యాయస్థానం బెయిల్ మంజురు చేసింది. తనను మోసం చేశాడు అంటూ లావణ్య అనే యువతి రాజ్పై నార్సింగి పీఎస్లో కేసు పెట్టిన విషయం తెలిసిందే.
ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రాజ్ తరుణ్పై కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు. అయితే దీనిపై రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించారు. రీసెంట్గా‘పురుషోత్తముడు’ ‘తిరగబడరసామీ’ అనే మూవీస్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.