మున్సిపల్ సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు .. భారీగా నగదు స్వాధీనం
ఇందూర్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించారు.
By : Vamshi
Update: 2024-08-09 12:00 GMT
నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా నగదు, ఆదాయానికి మించి ఆస్తులు బయటపడ్డాయి. అతడి నివాసంలో రూ.2.93 కోట్ల నగదు పట్టుబడింది. అలాగే రూ.1.10 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ నరేందర్, అతని సతీమణి, తల్లి ఖాతాల్లో ఉన్నట్లుగా గుర్తించారు.
వీటితో పాటు 51 తులాల బంగారం, రూ.1.98 కోట్ల విలువైన స్థిరాస్తులను గుర్తించారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 6.07 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.