బంగారం ప్రియులకు షాక్‌

దేశంలో పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగి కొనుగోలుదారులకు షాక్‌ ఇచ్చాయి.

By :  Raju
Update: 2024-07-18 03:31 GMT

బంగారం కొనుగోలుదారులకు ధరలు మళ్లీ షాక్‌ ఇచ్చాయి. ఈసారి ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రూ. 980 పెరిగింది. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 6.25 నిమిషాల వరకు హైదరాబాద్‌, విజయవాడలలో 22 క్యారెట్ల బంగారం ధ 10 గ్రాములకు రూ. 68,760 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 75,010కు చేరుకున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ. 75,160కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 68,910కి చేరుకున్నది.

మరోవైపు సిల్వర్‌ ధర కిలోకు రూ. 1200 పెరిగింది. ఢిల్లీలో రూ. 96,100 చేరుకున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలను చేరడం గమనార్హం.

బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)

ఢిల్లీలో రూ. 75,160, రూ. 68,910

హైదరాబాద్‌లో రూ. రూ. 75,010, రూ. 68,760

విజయవాడలో రూ. 75,010, రూ. 68,760

బెంగళూరులో రూ. 75,010, రూ. 68, 760

ముంబాయిలో రూ. 75,010, రూ. 68, 760

కోల్‌కతాలో రూ. 75,010, రూ. 68, 760

చెన్నైలో రూ. 75,500, రూ. 69,210


ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు (కిలోకు)

ఢిల్లీలో రూ. 96,100

హైదరాబాద్‌లో రూ. 1,00,600

విజయవాడలో రూ. 1,00,600

బెంగళూరులో రూ. 94,850

చెన్నైలో రూ. 1,00,600

గమనిక: పుత్తడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించాలి.

Tags:    

Similar News