సంగారెడ్డి టోల్‌ప్లాజా వద్ద 4.8 కిలోల బంగారం పట్టివేత

సంగారెడ్డిలోని కంగోల్ టోల్‌ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

By :  Vamshi
Update: 2024-08-06 11:55 GMT

సంగారెడ్డిలోని కంగోల్ టోల్‌ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రెవేటు ట్రావెల్స్ బస్సులో తనిఖీలు చేపట్టి సుమారు 4.8 కిలోల పసిడిని పట్టుకున్నారు. ముంబాయి నుంచి హైదరాబాద్‌కు దీన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవలే సంగారెడ్డి జిల్లాలో రూ. 3.10 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News