సోమాలియా బీచ్లో ఆత్మాహుతి దాడి 32 మంది మృతి
సోమాలియా రాజధాని మొగదీషులో గల బీచ్ హోటల్లో దుండుగుడు ఆత్మాహుతి పాటు దాడితో కాల్పులు జరపాడంతో 32 మంది మృతి చెందారు.
By : Vamshi
Update: 2024-08-03 09:43 GMT
సోమాలియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదేశ రాజధాని మొగదీషులోని ఓ బీచ్లో దుండుగుడు ఆత్మాహుతి దాడితో పాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈఘటనలో 32 మంది మృతి చెెందాగా మరో 63 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఆల్ఖైదా అనుబంద సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జన సంచారం ఎక్కువ ఉన్న చోట ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు. గత ఏడాది ఇదే బీచ్ లో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు