నేడు 317, 46 జీవోల క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

నేడు సచివాలయంలో 317, 46 జీవో ల పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ కానున్నది

By :  Raju
Update: 2024-07-26 07:36 GMT

నేడు సచివాలయంలో 317, 46 జీవో ల పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ కానున్నది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఛాంబర్ లో మధ్యాహ్నాం 3.30 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి 10 శాఖల ప్రధాన/ముఖ్య/కార్యదర్శులు ఆయా శాఖల్లోని 317 జీవో బాధిత ఉద్యోగుల పూర్తి సమాచారంతో రావాలని కమిటీ ఆదేశించింది.

ఇప్పటికే స్పౌజ్‌, మెడికల్‌, మ్యూచువల్‌, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య\భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నది. మిగతా దరఖాస్తులపై శాఖాల వారీగా నివేదికలు సిద్ధం చేసింది. 16వ తేదీ నాటికే జీడీఏకు చేరిన నివేదికలపై నేడు కమిటీలో చర్చించనున్నారు.

డీఎస్సీ 2008 బాధితులకు ఉద్యోగాలు ఇచ్చే అంశంపై విద్యాశాఖకు కమిటీ ఆదేశాలు ఇవ్వనున్నది. దీనిపై కోర్టు ఇచ్చిన గడువు మేరకు ఆగస్టు 8 లోగా ఉద్యోగాలు ఇవ్వాల్సిన నేపథ్యంలో విధివిధానాలపై స్పష్టత కోరనున్నది.




 


Tags:    

Similar News