జీహెచ్‌ఎంసీలో పరిధిలో ఈ ఒక్క రోజే 12 మంది పిల్లలపై కుక్కల దాడి

గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ ఒక్క రోజే వీధి కుక్కలు 12 మంది పిల్లలను గాయపర్చాయి.

By :  Vamshi
Update: 2024-08-01 15:28 GMT

హైదరాబాద్‌ బాలానగర్ పరిధిలో ఈ ఒక్క రోజే వీధి కుక్కలు 12 మంది పిల్లలను గాయపర్చాయి. బాలనగర్ పలు బస్తీల్లో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. రాజు కాలనీ, వినాయక్ నగర్, సాయి నగర్ ప్రాంతాల్లో 12 మంది పసిపిల్లల కుక్కల దాడి చేశాయని స్ధానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జున్ 6న మియాపూర్‌లో కుక్కల దాడిలో ఆరేండ్ల సాత్విక్‌ను దాడి చేసి చంపేశాయి.

మొన్న జూబ్లీ హిల్స్ చిత్రపూరి కాలనీలో వాకింగ్‌ చేస్తున్న గృహిణిపై కుక్కల మంద దాడి చేసి గాయపరిచాయి. అంబర్‌పేటలోని ఎరుకల బస్తీలో వీధి కుక్కలు స్కూల్‌కు వెళ్లే చిన్నారులపై దాడిచేయగా, ఓ బాలుడు చనిపోయాడు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి కుక్కలు పేట్రేగిపోతున్నాయి. బస్తీలు, కాలనీల్లో స్వైర విహారం చేస్తున్నాయి. కొన్ని చోట్ల క్రూర మృగాల్లా రెచ్చిపోతూ.. పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News