ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ 10 మంది మవోలు మృతి
ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపుర్ జిల్లా సరిహద్దుల్లో అడవీ ప్రాంతల్లో భద్రతా బలగాల కాల్పుల్లో 10 మంది మవోయిస్టులు హతమయ్యారు.
By : Vamshi
Update: 2024-09-03 08:40 GMT
ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపుర్ జిల్లా సరిహద్దుల్లో అడవీ ప్రాంతల్లో భద్రతా బలగాల కాల్పుల్లో 10 మంది మవోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్క సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాలు అలజడి వినగానే మావోయిస్టులు కాల్పులు జరిపారు.
దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఎదురుకాల్పుల్లో పది మంది మావోలు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న మావోల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.