హాస్పిటల్లో పెచ్చులు ఊడి ఇద్దరు మెడికల్ విద్యార్థినులకు గాయాలు
Byline : Vamshi
Update: 2024-06-07 09:08 GMT
ప్రభుత్వ ఆస్పత్రిలో స్లాబుపై పెచ్చులు ఊడి పోయి ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్ రామాంతపూర్లోని డీకే గవర్నమెంట్ హోమియోపతీ హాస్పిటల్లో చోటుచేసుకుంది. మెడికల్ ఆస్పత్రిలో షేషెంట్ వార్డులోని పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థునుల తలలు పగిలాయి. ఒక విద్యార్థినికి స్పల్ప గాయాలు కాగా, మరో విద్యార్థినికి తలపై తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. మరో విద్యార్థినికి తలపై తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.