బస్సులో అత్యాచారం కేసులో ఇద్దరు అరెస్ట్‌

బస్సులో అత్యాచారం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

By :  Raju
Update: 2024-07-31 08:22 GMT

నిర్మల్‌ నుంచి ప్రకాశం వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సులో డ్రైవర్‌ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ బాలస్వామి వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలు అత్యాచారానికి గురైనట్టు అర్ధరాత్రి ఫిర్యాదు చేసింది. హరికృష్ణ ట్రావెల్స్‌కు సంబంధించిన నెల్లూరుకు చెందిన ఈర్ల కృష్ణబాబు, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధయ్య అనే ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేశామని తెలిపారు.

చేగుంటలో భోజనం చేసిన తర్వాత సిద్దయ్య డ్రైవ్‌ చేశాడు. కృష్ణబాబు బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సిద్దయ్య అతనికి సహకరించినట్టు డీసీపీ పేర్కొన్నారు.బాధితురాలు తన కూతురుతో కలిసి ప్రయాణిస్తున్నది... కానీ ఒకే బెర్త్‌ బుక్‌ చేసుకున్నది. దాంతో వెనకాల ఉన్న బెర్తెలోకి వెళ్లాలని చెప్పిన నిందితుడు ఈ అఘాయీత్యానికి పాల్పడ్డాడు. నిన్న యాచారం పరిధిలో నిందితులను అరెస్టు చేసినట్టు వారిని రిమాండ్‌కు తరలిస్తున్నామని చెప్పారు. బాధితురాలి భర్త ఏడేళ్ల కిందట మరణిచినట్టు డీసీపీ వెల్లడించారు. 

Tags:    

Similar News