కేదార్‌నాథ్‌ యాత్రలో విషాదం.. ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకున్నది. అక్కడి చిద్వాసాలో కొండచరియలు విరిగి పడి ముగ్గురు భక్తులు మృతి చెందారు.

By :  Raju
Update: 2024-07-21 05:45 GMT

ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకున్నది. అక్కడి చిద్వాసాలో కొండచరియలు విరిగి పడి ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆ ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడానికి సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 

జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ తెలిపిన ప్రకారం.. కొండపై నుండి రాళ్లు పడటం, కొండచరియలు విరిగిపడటం వల్ల కొంతమంది యాత్రికులు శిథిలాల కింద చిక్కుకున్నారని విపత్తు నియంత్రణ కార్యాలయానికి ఉదయం 7:30 గంటలకు సమాచారం అందిందని చెప్పారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. 

Tags:    

Similar News