మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయంలో చోరీ
మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు రెండు హుండీలను ధ్వంసం చేసి నగదు, కానుకలు ఎత్తుకెళ్లారు.
By : Raju
Update: 2024-08-10 05:02 GMT
మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయంలో చోరీ జరిగింది. గర్భగుడి ముందున్న రెండు హుండీలను దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగలు హుండీలను పాత కల్యాణకట్ట వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వాటిని ధ్వంసం చేసి నగదు, కానుకలు ఎత్తుకెళ్లారు.
పదిరోజుల కిందటే దేవాలయంలోని హుండీలను సిబ్బంది లెక్కించింది. మరోవైపు చోరీపై పాపన్నపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.