రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

హబ్సిగూడలో ఆర్టీసీ బస్సు కిందికి దూసుకెళ్లిన ఆటో..పోలీసులు క్రేన్‌ సహాయంతో బస్సు కిందికి వెళ్లిన ఆటోను తొలిగించారు.

By :  Raju
Update: 2024-08-17 08:36 GMT

హబ్సిగూడలో శనివారం పొద్దున జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందింది. ఈ ఘటన విషాదాన్ని నింపింది. వెనక నుంచి వస్తున్న కంటెయినర్‌ ఆటోను ఢీకొట్టడంతో అదుపు తప్పి ఆర్టీసీ బస్సుకిందికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌ పదో తరగతి చదువుతున్న సాత్విక అనే విద్యార్థినికి తీవ్ర గాయాలు కాగా.. నాచారంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఆటో డ్రైవర్‌ ఎల్లయ్యకు తీవ్ర గాయాలు కాగా.. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. పోలీసులు క్రేన్‌ సహాయంతో బస్సు కిందికి వెళ్లిన ఆటోను తొలిగించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. 

Tags:    

Similar News