ఏసీబీ కి చిక్కిన రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్
రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన ఏసీబీ కి చిక్కారు. ధరణిలో మార్పులు చేయడానికి రూ. 8 లక్షలు డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన ఏసీబీ కి చిక్కారు. ధరణిలో మార్పులు చేయడానికి రూ. 8 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తో జాయింట్ కలెక్టర్ ను ఏసీబీ ట్రాప్ చేసింది. ధరణి వెబ్ సైట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల భూమిని తొలిగించాలని బాధితుడు కోరాడు. ఈ పని చేయడానికి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి రూ ఎనిమిది లక్షలు డిమాండ్ చేశాడు. కారులో డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ పట్టుకున్నది.
జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చెప్పాడు. ఏసీబీ అధికారుల ముందే మధుమోహన్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఫోన్ చేయగా.. పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని చెప్పాడు. పెద్దంబర్పేట వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి కి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ డబ్బులు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.ఈ ఇద్దరి ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.ఈ ఇద్దరి ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నాగోల్లోని జాయింట్ కలెక్టర్ భూపాల్రెడ్డి ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో రూ.16 లక్షల నగదు, కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.