పోలీసుల విచారణకు హాజరుకాని రాజ్‌ తరుణ్‌

నేడు నార్సింగ్‌ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిన నటుడు రాజ్‌ తరుణ్‌ గైర్హాజరయ్యారు.

By :  Raju
Update: 2024-07-18 07:50 GMT

నటుడు రాజ్‌తరుణ్‌-లావణ్య ప్రేమ వ్యవహారం కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకున్నది. నార్సింగ్‌ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిన రాజ్‌ తరుణ్‌ గైర్హాజరయ్యారు. తన న్యాయవాది ద్వారా ఆయన పోలీసులు నోటిస్ లలో అడిగిన ప్రశ్నలకు వివరణలు పంపించారు. తాను అందుబాటులో లేనికారణంగా పోలీసుల విచారణకు హాజరుకాలేకపోతున్నట్టు తెలిపారు.

అయితే లావణ్య ఫిర్యాదు నేపథ్యంలో మరోసారి రాజ్‌ తరణ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలో రాజ్‌ తరుణ్‌, హీరోయిన్‌ మాల్వి, ఆమె సోదరుడు మయాంక్‌లపై నార్సింగ్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Tags:    

Similar News