ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ ఘాతుకం.. ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన బాంబ్‌ పేలి ఇద్దరు స్పెషల్‌ టాస్క్‌పోర్స్‌ కానిస్టేబుళ్లు మృతి చెందారు.

By :  Raju
Update: 2024-07-18 06:05 GMT

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పెట్టిన ఐఈడీ పేలి ఇద్దరు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుళ్లు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి బీజాపూర్‌లో జరిగింది. గాయపడిన వారిని హెలికాప్టర్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు.

యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్‌లో భాగంగా ఎస్‌టీఎఫ్‌, జిల్లా రిజర్వ్‌ గార్డ్‌, సీఆర్‌ఫీఎఫ్‌, రాష్ట్ర పోలీసులు కలిసి మంగళవారం సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. బుధవారం రాత్రి ఈ ఆపరేషన్‌ ముగించుకొని తిరిగి వస్తుండగా తుర్రేమ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎస్‌టీఎఫ్‌ కానిస్టేబుళ్లు రాయపురకు చెందిన భరత్‌ సాహు, నారాయణపూర్‌ జిల్లాకు చెందిన సత్యర్‌సింగ్‌ కాంగే మరణించినట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News