కోల్కతా హత్యాచార ఘటన.. మాజీ ప్రిన్సిపల్కు పాలిగ్రాఫ్ పరీక్ష
ఈ కేసులో సందీప్ఘోష్ను సీబీఐ విచారిస్తున్నది. ఈ క్రమంలోనే లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని సీబీఐ భావిస్తున్నది.
By : Raju
Update: 2024-08-21 07:23 GMT
కోల్కతా హత్యాచార ఘటనలో ఆర్జీ కార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు సీబీఐ పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు వరుసగా మూడు రోజుల పాటు ఆయనను ప్రశ్నించారు. విచారణ సందర్భంగా డాక్టర్ సందీప్ ఇచ్చిన సమాధానాలలో కొన్ని లోపాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి ధృవీకరణ కోసం లైడిటెక్టర్ పరీక్ష జరపాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
ఈ కేసులో అరెస్టయిన సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ పరీక్షలు జరపాలని సీబీఐ అధికారులు ఇప్పటికే స్థానిక కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు నిర్వహిస్తున్నది.