టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్
హైదరాబాద్లో ఆయన్ను అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్స్టేషన్ తరలించిన పోలీసులు
By : Raju
Update: 2024-09-05 09:32 GMT
వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలపై కేసులు నమోదైన విషయం విదితమే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
ఈ నేపథ్యంలో సురేశ్ను అరెస్టు చేయడానికి తుళ్లూరు పోలీసులు బుధవారం ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి వెళ్లారు. సుమారు 15 నిమిషాలు అక్కడ ఎదురుచూసిన వారికి ఆయన అక్కడ లేడని తెలియడంతో వెనుదిరిగారు. ఆయన సెల్ఫోన్ కూడా స్విచాఫ్ చేశారు. పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సురేశ్ ఎక్కడున్నారో తెలుసుకున్నారు. హైదరాబాద్లో ఆయన్ను అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా మంగళగిరి పీఎస్కు తరలించారు.