తిరువళ్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ విద్యార్థుల దుర్మరణం

తమిళనాడులోని తిరువళ్లూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 5 గురు విద్యార్థులు దుర్మణం చెందారు

By :  Raju
Update: 2024-08-12 06:03 GMT

తమిళనాడులోని తిరువళ్లూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 5 గురు విద్యార్థులు దుర్మణం చెందారు. ఏడుగురు స్నేహితులు ఒకే కాలేజీలో చదువుతున్నారు. రెండు రోజులు సెలవులు రావడంతో ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న వారిపై లారీ మృత్యు రూపంలో దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తిరిగిరాని లోకాలకు వెళ్లారు.

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన చైతన్య చెన్నై సమీపంలోని ఎస్‌ఆర్‌ఎం కాలేజీలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నాలుగు రోజులు సెలవులు రావడంతో తోటి విద్యార్థులతో శనివారం కారులో తిరువణ్ణామళై అరుణాచలేశ్వరానికి వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం తిరిగి ఆదివారం చెన్నైకి బయలుదేరారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోకి రాగానే... ఎదురుగా వేగంగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న ప్రొద్దుటూరుకు చెందిన గిద్దలూరు నితీశ్‌, తిరుపతికి చెందిన యుగేశ్‌, చేతన్‌, కర్నూల్ కు చెందిన రామ్మోహన్‌, విజయవాడకు చెందిన బన్ను నితీశ్‌ ఘటనాస్థలంలోనే మృతి చెందారు. నెల్లూరుకు చెందిన విష్ణు, ప్రకాశం జిల్లా వాసీ చైతన్యకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను పోలీసులు అతి కష్టంగా బైటికి తీసి పోస్ట్‌మార్టానికి పంపించారు.   

Tags:    

Similar News