భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టుల మృతి

మృతుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం

By :  Raju
Update: 2024-09-05 03:50 GMT

భద్రాద్రి జిల్లా కరికగూడెం మండలం రఘునాథపాలెం వద్ద మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మృతుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది.ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News