శామీర్‌ పేటలో కారు బీభత్సం.. ఇద్దరు మృతి

శామీర్‌ పేటలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

By :  Raju
Update: 2024-07-26 05:46 GMT

హైదరాబాద్‌ శామీర్‌ పేటలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. జీనోమ్‌ వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇన్నోవా కారు అదపు తప్పి ఇతర వాహనాలను ఢీకొట్టబోయి పక్కరోడ్డులో బోల్తా కొట్టింది. దీంతో ఇన్నోవా కారులో ఉన్న ఇద్దరు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.

ప్రమాదంలో ఎదురుగా వచ్చిన ఇన్నోవాను తప్పించబోయిన ప్రైవేట్‌ బస్సు రోడ్డు పక్కకు దూసుకుపోయింది. కారు అతి వేగంగా నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు.

Tags:    

Similar News