కవితపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం

చర్యలు తీసుకోవాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు

Update: 2024-08-30 17:22 GMT

ఎమ్మెల్సీ కవితపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం సైబర్‌ క్రైమ్‌ డీసీపీ కవితను కలిసి ఫిర్యాదు లేఖ అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌, ఆ పార్టీ నాయకులు కవిత వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు పెట్టి అవమానిస్తున్నారని తెలిపారు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఒకవేళ బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే బీఆర్‌ఎస్‌వీ నాయకులు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు రంగినేని అభిలాష్‌, మేకల విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News