ఒడిషాలో ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్‌ యాత్రికుల మృతి

హైదరాబాద్‌ నుంచి భక్తులతో ఒడిషాకు వెళ్లి బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మృతి చెందారు.

By :  Raju
Update: 2024-07-13 15:12 GMT

ఒడిషాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మృతి చెందారు. పాతబస్తీకి ఛత్రినాక నుంచి 23 మంది భక్తులు ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సులో తీర్థయాత్రకు వెళ్లారు. బరంపురం సమీపంలో మరో వాహనాన్ని ఢీకొట్టడంతో బస్సులో ఉన్న ఉదయ్‌సింగ్‌, క్రాంతి భాయ్‌, ఉప్పలయ్య దుర్మరణం చెందారు. ఇదే ప్రమాదంలో 20 మంది గాయపడగా.. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.బాధితులంతా ఉప్పుగూడ వాసులుగా గుర్తించారు. యాత్రికులు పూరీని సందర్శించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. 

ఒడిషా బస్సు ప్రమాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరా తీశారు. సంజయ్‌ ఆదేశాలతో హోం శాఖ కార్యాలయ సిబ్బంది ఒడిషా అధికారులతో మాట్లాడింది. గాయపడిన వారికి మెరుగై చికిత్స అందించాలని హోం శాఖ కోరింది. 

Tags:    

Similar News