బైక్ను ఢీకొట్టిన కారు.. ఏడేళ్ల బాలుడి మృతి
మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి ఏడేళ్ల బాలుడి మృతి కారణమయ్యాడు. హైదరాబాద్ గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్లో ఈ ఘటన చోటుచేసుకున్నది.
By : Raju
Update: 2024-08-03 06:44 GMT
మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి ఏడేళ్ల బాలుడి మృతి కారణమయ్యాడు. హైదరాబాద్ గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్లో ఈ ఘటన చోటుచేసుకున్నది. తల్లిదండ్రులతో కలిసి ఇబ్రహీంబాగ్ నుంచి రోడ్పైకి వస్తుండగా..ఎదురుగా వచ్చిన కారు వేగంగా ఢీకొట్టడంతో బాలుడు సూర్య అక్కడికక్కడే మృతి చెందాడు.
మద్యం మత్తులో కారు నడిపినట్లు.. కారులో మద్యం సీసాలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.