నటుడు రాజ్‌తరుణ్‌పై నార్సింగి పీఎస్‌లో కేసు నమోదు

ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని లావణ్య అనే యువతి ఫిర్యాదు మేరకు సినీ నటుడు రాజ్‌తరుణ్‌పై కేసు నమోదైంది.

By :  Raju
Update: 2024-07-11 06:12 GMT

తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య అనే యువతి నటుడు రాజ్‌తరుణ్‌ పై నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్‌తరుణ్‌తో పాటు మాల్వి మల్హోత్రా, మయాంక్‌ మల్హోత్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్‌తరుణ్‌ మరో మహిళలకు దగ్గరై తనను బెదిరిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

రాజ్‌తరుణ్‌, తాను 2012 నుంచి రిలేషన్‌లో ఉన్నామని, ఇటీవల అతను మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్‌తో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నది. ' తిరగబడండ్రా సామి' అనే మూవీ షూటింగ్‌ నుంచి తామిద్దరం రిలేషన్‌ కొనసాగిస్తున్నామని ఇదే విషయంపై రాజ్‌తరణ్‌ను నిలదీస్తే తనను తిట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నది.

అలాగే జనవరిలో నేను అమెరికా నుంచి తిరిగి వచ్చాను.డ్రగ్స్‌ కేసు ఆరోపణలతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసులు నన్ను అరెస్టు చేశారు. 45 రోజులు జైళ్లో పెట్టారు. రాజ్‌తరుణ్‌, మాల్వి మల్హోత్రా కలిసి నన్ను ఈ కేసులో ఇరికించారు. తనను మోసం చేసిన రాజ్‌తరుణ్‌పై చర్యలు తీసుకోవాలని లావణ్య ఫిర్యాదు చేశారు. 

Tags:    

Similar News