రేపు అన్ని విద్యాసంస్థలకు సెలవు

ఆదేశించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Update: 2024-09-01 07:55 GMT

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షాలు, వరద సహాయక చర్యలపై సెక్రటేరియట్‌ నుంచి ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఈమేరకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని, ఈ పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ లోని స్కూళ్లకు ఇప్పటికే సెలవు ప్రకటించారు. హైదరాబాద్‌ లోనూ మిగతా విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News