రేవంత్ తొమ్మిది నెలల పాలన ఈ ఒక్క చిత్రంలో
మహబూబ్ నగర్ లో దళితులు, దివ్యాంగుల ఇండ్ల కూల్చివేతలపై కేటీఆర్
By : Naveen Kamera
Update: 2024-08-31 17:50 GMT
రేవంత్ రెడ్డి తొమ్మిది నెలల పాలనకు తెలంగాణ రాష్ట్రం ఎంతలా శిథిలమైందో ఈ ఒక్క చిత్రం చెప్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్' వేదికగా మండిపడ్డారు. మహబూబ్ నగర్ పట్టణంలోని దళితులు, దివ్యాంగుల కాలనీపై తెల్లవారుజామున 3 గంటలకు బుల్డోజర్లు పంపి 75 ఇండ్లను నేలమట్టం చేసిన శిథిలాల ఫొటోలను కేటీఆర్ తన పోస్ట్ కు జత చేశారు. కూలిపోయిన ఇండ్లల్లో కన్నీటి పర్యంతమవుతూ తమ సామాగ్రిని వెదుక్కుంటున్న దళితులు, వికలాంగుల బాధను ఈ ఫొటోలు తెలియజెప్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ తెలంగాణలోని బుల్డోజర్ రాజ్ తెచ్చారని.. పదేళ్లు అభివృద్ధి సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణను శిథిలాల గూడుగా మార్చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.