ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడానికే రేవంత్ 'మీటర్ల' డ్రామా

తనకిష్టమైన ప్రైవేట్ సంస్థలకు విద్యుత్ పంపిణీ వ్యవస్థను కట్టబెట్టేందుకే సీఎం రేవంత్ మీటర్లపై కొత్త డ్రామా ఆడుతున్నారు.

By :  Raju
Update: 2024-07-28 09:29 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు,అబద్దాలతో అధికారంలోకి వచ్చిందని, ఇపుడు అదే అబద్ధాలతో పాలన సాగిస్తున్నదని,రేవంత్ రెడ్డి అనే పేరు అబద్ధానికి పర్యాయపదంగా మారిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. మాజీమంత్రి మహమూద్ అలీ ,ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రవీందర్ రావు ,మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ,కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె .వాసుదేవ రెడ్డిలతో కలిసి తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..

కేంద్ర ప్రభుత్వం మా మెడపైన కత్తి పెట్టి రైతుల మోటార్లకు మీటర్లను పెట్టమన్నా కేసీఆర్‌ ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. 2017 లోనే రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడానికి కేసీఆర్ ఒప్పుకున్నట్లు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పి సభను ప్రజలను తప్పు దోవ పట్టించారని మండిపడ్డారు. సీఎం చదివిన పేపర్ అబద్ధమని ఆయన చదివింది ఉదయ్ పథకానికి చెందినది. ఉదయ్ అనే పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది, డిస్కంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగాకేంద్ర ప్రభుత్వం రూల్ తీసుకువచ్చింది. ఉదయ్ పథకంలో తెలంగాణ ప్రభుత్వం చేరింది. ఉదయ్ పథకానికి సంబంధించిన పేపర్లోని వాక్యాన్ని కొంత మింగి కొంతే చెప్పారు. ఉదయ్ స్కీం లో 27 రాష్ట్రాలు చేరాయి .అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి . ఉదయ్ వల్ల వినియోగదారులకు నష్టం లేదు. ఏదో కొలంబస్ లాగా వాస్కోడిగామా లా ఏదో కనిపెట్టినట్టు రేవంత్ ఆ పేపర్ తీసుకొచ్చాడు. మీడియాలో తప్పుడు వార్తలు రాసేలా పతాక శీర్షికల్లో వచ్చేలా రేవంత్ కుట్ర పన్నారని, దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తప్పుడు వార్తలు రాసిన పత్రికలు తమ వైఖరి మార్చుకోవాలని మాజీ మంత్రి సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తెలంగాణ లో మీటర్లు పెట్టనందునే అప్పులకు వెసలు బాటు ఇవ్వలేకపోయామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

హైదరాబాద్ నగరంలో కరెంటు బిల్లులు కట్టడం లేదని పేపర్లలో తప్పుడు రాతలు రాయించారు. హైదరాబాద్ నగరంలో ప్రతి ఇంటికి మీటర్లు పెట్టామని చెప్పారు. స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులకు ఉరి వేసే ప్రయత్నం రేవంత్ చేస్తున్నాడు. తనకిష్టమైన ప్రైవేట్ సంస్థలకు విద్యుత్ పంపిణీ వ్యవస్థను కట్టబెట్టేందుకు రేవంత్ కొత్త డ్రామా ఆడుతున్నారు. తెలంగాణ ప్రజలు రేవంత్ కుట్రలను గమనించాలన్నారు. ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ స్మార్ట్ మీటర్ల ప్రస్తావన ఇపుడు తీసుకురావడం లో దుర్మార్గం ఉన్నది. కేసీఆర్ పదేళ్లు తెలంగాణ ప్రజలను కడుపు లో పెట్టుకుని చూసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి లాంటి నీచమైన సీఎం దేశం లో మరెవ్వరూ లేరని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ లో మందబలంతో ఏమార్చగలడేమో రేవంత్ ప్రజల నుంచి తప్పించుకోలేవు కేంద్రం రాష్ట్రాల మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు ఎవరూ దాచిపెట్టలేరని అన్నారు. రేవంత్ అసెంబ్లీ లో తప్పించుకున్నావ్ ..వస్తావా బహిరంగ చర్చకు అని సవాల్‌ విసిరారు.

Tags:    

Similar News